కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తితో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో భయం పోగొట్టి.. వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ నేతలు చొరవ తీసుకుంటున్నారు. ప్రధాని మోడీ కూడా పలు కీలక సూచనలు చేస్తూ.. వీడియో విడుదల చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ వంతు బాధ్యతగా దేశ ప్రజలకు కరోనా పై పలు జాగ్రత్తలు సూచించారు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. కరోనా వైరస్ మన దరి చేరకుండా ఉండవచ్చని చెబుతున్నారు.
The world is going through one of its hardest times. The only way to get past #COVID19 is not panicking and spreading awareness.
Stay Hygienic. Stay Safe! pic.twitter.com/UMHnLmdkA8
— RRR Movie (@RRRMovie) March 16, 2020