HomeTelugu Big Storiesమనోజ్ డేట్ ఫిక్స్ చేశాడు!

మనోజ్ డేట్ ఫిక్స్ చేశాడు!

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా  ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై రూపొందుతున్న చిత్రం ‘ఒక్క‌డు మిగిలాడు’.  ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు అజ‌య్ అండ్రూస్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మ‌నోజ్‌తో ఏడాదిన్న‌ర‌గా ట్రావెల్ అవుతున్నాను. హింస‌ – అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే పరిస్థితులకు తగ్గట్టు ఎలా అయితే ప్రవర్తిస్తామో అదేవిధంగా ఉంటుంది  మనోజ్ గారి క్యారెక్టరైజేషన్. ఈ సినిమా కోసం మ‌నోజ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. 10 కిలోలు త‌గ్గాడు. నిర్మాతలు ఎంతో స‌పోర్ట్ చేశారు” అన్నారు.  
 
నిర్మాతలు  ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. “గ్రాఫిక్స్ వర్క్ వల్లే సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఆ ఆలస్యం కూడా మంచిదే.. సముద్రం దగ్గర షూట్ చేసిన సీన్స్ విశేషంగా ఆకట్టుకొంటాయి. ఇక వార్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం” అన్నారు.  

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!