HomeTelugu Newsకేంద్రమంత్రిని కలిసిన పాయల్‌ ఘోష్

కేంద్రమంత్రిని కలిసిన పాయల్‌ ఘోష్

Payal ghosh meets kishan re
బాలీవుడ్‌ హీరోయిన్‌ పాయల్ ఘోష్ డైరెక్టర్‌ అనురాగ్ కశ్యప్ పై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని పాయల్ ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అనురాగ్ కాశ్య‌ప్ పై అత్యాచారం కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో అనురాగ్ కాశ్యప్ ను పోలీసులు సుమారు 8 గంటలు విచారించారు. పాయల్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అనురాగ్ ఇప్పటికే తీవ్రంగా ఖండించాడు. తాజాగా పాయల్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసింది. తనకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ కిషన్ రెడ్డికి పాయల్ లేఖ అందజేశారు. ఆ విషయాన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది పాయల్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu