పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఓసారి సర్జరీ జరిగిందని సమాచారం. తాజాగా మరోసారి కాలుకు సర్జరీ జరుగనుందని తెలుస్తోంది. బాహుబలి సమయంలో ఓ యాక్షన్ సీన్లో ప్రభాస్ కాలుకి గాయం అయ్యిందట. ఆ గాయం ఆయన్ను అప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది. మరోసారి ఆ గాయం కారణంగా ఆయన ఇబ్బందులు పడుతున్నారట.
ఈ కారణంగా ఆయన సలార్, కల్కి షూటింగ్ పూర్తి అయ్యిన తర్వాత చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది. సర్జరీ అనంతరం ప్రభాస్ కొన్ని నెలలు పూర్తి విశ్రాంతిలో ఉంటారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళనకు గురౌతున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవలే విడుదలైన నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.