HomeTelugu Trendingవెంకటేష్‌తో ప్రియమణి..!

వెంకటేష్‌తో ప్రియమణి..!

2 1
తమిళ నటుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అసురన్‌’. భూ వివాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల లభించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ రీమేక్‌లో వెంకటేష్‌ నటించనున్నట్లు తెలిపింది. అయితే, ‘అసురన్‌’ చిత్రంలో కీలకమైన ధనుష్‌ సతీమణి మంజువారియర్‌ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయం పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలవడలేదు. దీంతో ఈ సినిమాలో వెంకటేష్‌కు జంటగా శ్రియా కనిపించనున్నారంటూ గతకొంతకాలం వార్తలు వచ్చాయి. వీటిపై ఎటువంటి స్పష్టత రాలేదు. తాజాగా ప్రియమణి పేరు కూడా వినిపిస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను కలిసిందట. కథ కూడా నచ్చడంతో ప్రియమణి సైతం వెంకటేశ్‌ సరసన ‘అసురన్‌’ రీమేక్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి‌. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu