గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. సరోగసి ద్వారా ప్రియాంక తల్లైంది. ఈ విషయాన్ని ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..’ అని రాసుకొచ్చింది.
ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు, అభిమానులు ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్లోని ఉమైద్ భవన్ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు.
View this post on Instagram