HomeTelugu Trendingరియాలిటీ షో ప్రియాంక, కరీనా ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్‌

రియాలిటీ షో ప్రియాంక, కరీనా ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్‌

2 26బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సినిమా విడుదల అయ్యి మూడేళ్లయింది. పెళ్లి తరువాత మరో సినిమాకు సైన్ చేయలేదు. పెళ్లికి ముందు ఆమె అంగీకరించిన స్కై ఈజ్ పింక్ సినిమాను పూర్తి చేసిన ప్రియాంక ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా మారింది. ఇటీవలే టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. రియల్ స్టోరీ ఆధారంగా సినిమా తెరక్కింది.

డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రియాలిటీ షోలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ రియాలిటీ షోకు కరీనా కపూర్ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్యాన్స్ షోలో స్కై ఈజ్ పింక్ సినిమాను ప్రమోషన్ చేసేందుకు యూనిట్ హాజరయ్యింది. కాగా, స్కై ఈజ్ పింక్ సినిమా గురించిన అనేక కబుర్లను యూనిట్ రియాలిటీ షో సభ్యులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కరీనా, ప్రియాంక చోప్రాలు ముద్దులు పెట్టుకున్నారు. దేనికి సంబంధించిన చిన్న వీడియోను ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu