
Chiranjeevi next movie update:
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర)తో సినిమాకు సిద్ధమవుతున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత ఈ కాంబో మళ్లీ ఓ భారీ ప్రాజెక్ట్ కోసం కలసింది.
ఇటీవల బాబీ – చిరంజీవికి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా సంపాదించేశాడు. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 కోట్ల వరకూ వెళుతోంది. ఇందులో చిరంజీవి రెమ్యూనరేషన్ మాత్రమే రూ.75 కోట్లు. మిగతా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు కలిపితే మరో రూ.25 కోట్లు అవుతాయట. సినిమా నిర్మాణ ఖర్చులు రూ.100 కోట్లు.
ఇంత భారీ బడ్జెట్ చూసి పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఒక అడుగు వెనక్కు వేస్తున్నాయట. అందుకే చిరంజీవి స్వయంగా మంచి నిర్మాత కోసం ప్రయత్నిస్తున్నారు. హై బడ్జెట్ సినిమాను ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయగల నిర్మాత అవసరం ఉన్న విషయం తెలిసిందే. చిరు మాట మేరకు ఈ ప్రాజెక్ట్ను త్వరలోనే ఫైనల్ చేయాలని బాబీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద అభిమానుల్లో న్యూస్ పెరుగుతోంది. ఎవరిని నిర్మాతగా ఎంపిక చేస్తారన్నది టాలీవుడ్ లో ఆసక్తికర చర్చగా మారింది. సినిమా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్నాయి.