HomeTelugu Trendingపునర్నవి పేరెంట్స్‌ను కలిసిన రాహుల్ సిప్లిగంజ్

పునర్నవి పేరెంట్స్‌ను కలిసిన రాహుల్ సిప్లిగంజ్

14 1
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేసిన తెలుగు బిగ్ బాస్ 3 లో పాపులరైన జంట పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్. ఒకే ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారిందని అందరు చెవులు కొరుక్కున్నారు. అంతేకాదు హౌస్‌లో వీళ్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవికి కూడా ఈ ప్రశ్న కామన్ అయిపోయింది. ఇదిలా ఉంటే అప్పట్లో నాగార్జున కూడా వీరిద్దరిని ఈ విషయంలో సరదాగా ఒక ఆటాడుకున్నాడు. అయితే బిగ్‌బాస్ తర్వాత ఈ జంట తమ కెరీర్ పై దృష్టి సారించారు.

ప్రస్తుతం రాహుల్ కెరీర్ పీక్స్‌లో ఉంది. సింగర్ గానే కాకుండా నటుడిగానూ అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో రాహుల్ అవకాశం దక్కించుకున్నాడు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రాహుల్‌ నటుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని నటీనటులకు చిత్ర యూనిట్ ఇచ్చిన పార్టీలో రాహుల్‌తోపాటు పునర్నవి కూడా పాల్గొంది. ఈ సినిమాలోని ఒక పాటకు వీరిద్దరూ
డ్యాన్స్‌ కూడా చేశారు. రాహుల్ కూడా ఇటీవల పునర్నవి పేరెంట్స్ ను కలిసాడు ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అభిమానుల కోసం తాను, పునర్నవి కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని అప్పట్లో ప్రకటించిన రాహుల్. ప్రస్తుతం ఆ ఆల్బమ్ పర్మిషన్ గురించి పునర్నవి పేరెంట్స్ ను కలిసినట్టు తెలిపాడు. ఈ ఆల్బమ్ లో పునర్నవి నటించనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu