HomeTelugu Trendingశ్రీముఖికి ఫోన్‌ చేసా.. మాట్లాడలేదు.. రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు

శ్రీముఖికి ఫోన్‌ చేసా.. మాట్లాడలేదు.. రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు

9 22తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతున్నట్లే కనిపిస్తుంది. ముందు నుంచి ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరం దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే మరోసారి రిపీట్ అయింది. తాజాగా నవంబర్ 29వ తేదీన రాహుల్ ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాడు. దానికోసమే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసాడు రాహుల్‌. తాను చేయబోతున్న లైవ్ కన్సర్ట్‌కు చాలా మంది సెలెబ్రిటీస్ కూడా వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఈయన. అంతేకాదు.. బిగ్ బాస్ టీం అందర్నీ కూడా తాను పిలిచానని.. అయితే అందులో ఎంతమంది వస్తారనేది మాత్రం తనకు తెలియదంటున్నాడు.

ముఖ్యంగా తన గ్యాంగ్ అయితే కచ్చితంగా వస్తున్నారని చెప్పాడు. పున్ను, వరుణ్ సందేశ్, వితిక మాత్రం 100 పర్సెంట్ వస్తారని కన్ఫర్మ్ చేసాడు రాహుల్. ఇక శ్రీముఖి విషయానికి వచ్చేసరికి కాస్త డిఫెరెంట్‌గా స్పందించాడు రాహుల్. తను రెండు రోజుల కింద శ్రీముఖికి ఫోన్ చేసానని.. అయితే తన ఫోన్ ఎవరో వేరే వాళ్లు ఎత్తి షూట్‌లో ఉన్నట్లు చెప్పారని తెలిపాడు. నేను రాహుల్ మాట్లాడుతున్నానని చెప్తే ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేసాడన్నట్లు ఫోజ్ కొట్టారని చెప్పాడు రాహుల్.

శ్రీముఖికి తాను ఫోన్ చేసినట్లు తెలిసిన తర్వాత కూడా ఇంకా తిరిగి కాల్ చేయలేదని.. ఇంట్లో జరిగిన విషయాలు ఇంకా ఆమె గుర్తు పెట్టుకుందేమో అంటూ సెటైర్ వేసాడు. తాను అన్నీ క్లియర్ చేసిన తర్వాత కూడా ఇంకా మనసులోనే పెట్టుకుంటే ఎవరేం చేయలేరంటున్నాడు రాహుల్. శ్రీముఖి బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయిందని.. మరి తాను ఫోన్ చేసిన సంగతి గుర్తుందో లేదో అంటూ సెటైరికల్ కమెంట్ చేసాడు. రాహుల్ మాటలు చూస్తుంటే కచ్చితంగా ఈ ఇద్దరి మధ్య ఇంకా గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయిందని అర్థమైపోతుంది. మరి రాహుల్ చేస్తున్న ఈవెంట్‌కు శ్రీముఖి వస్తుందో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu