HomeTelugu Trending'సీసీసీ'కి జక్కన్న విరాళం

‘సీసీసీ’కి జక్కన్న విరాళం

2 11
కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపద్యంలో రోజు కూలీలు, వలస కూలీలు అకలి బాధలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ స్థాపించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇచ్చిన పిలుపు మేరకు తారలు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, నితిన్‌, వినాయక్, అనీల్ రావిపూడి తదితరులు తమ వంతు విరాళలు చేస్తున్నారు. తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి సినీ కార్మికులకి తన వంతు సాయం చేసేందుకు ముందుకువచ్చారు. ఇప్పటికే భారీగా మాస్కులతో పాటు ప్రొటెక్టర్స్ అందించిన జక్కన, ఇప్పుడు తన నిర్మాత డివివి దానయ్యతో కలిసి ‘సీసీసీ’కి 10 లక్షల విరాళం ప్రకటించాడు. త్వరలోనే ఈ మొత్తాన్ని ఛారిటీకి అందించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu