ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ గురించి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అయితే తాజాగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రాజమౌళి.
మహేష్ బాబు SSMB 29 ప్రాజెక్ట్ కోసం ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ కి వెళ్లనున్నారు అని అన్నారు. బ్యాంకాక్ లో మూడు నెలల పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, హైకింగ్, స్కేలింగ్ టెక్నిక్స్, ట్రెక్కింగ్ నేర్చుకోనున్నారు అని అన్నారు. అయితే మహేష్ బాబు ఈ సినిమా లో మార్షల్ ఆర్ట్స్ తో ఆకట్టుకొనున్నారు. ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.