HomeTelugu Trending'దర్బార్' కోసం ఆ ముగ్గురు నిర్మాతలు

‘దర్బార్’ కోసం ఆ ముగ్గురు నిర్మాతలు

6 5సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ప్రస్తుతం ‘దర్బార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇప్పటి వరకు యూనిట్ కేవలం ఫోటోలను మాత్రమే విడుదల చేయగా, త్వరలోనే ఈమూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ తో ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, రజినీకాంత్ దర్బార్ సినిమాకోసం తెలుగులో ముగ్గురు నిర్మాతలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది.

దిల్ రాజు – ఎన్వీ ప్రసాద్- యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమా రైట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. గత కొంతకాలంగా రజినీకాంత్ సినిమాలు తెలుగులో పెద్దగా విజయం సాధించడం లేదు. కానీ, క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. 2పాయింట్ 0 సినిమాను భారీగా కొనుగోలు చేసినా.. దానికి తగినట్టుగా వసూళ్లు సాధించలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను తక్కువకు తీసుకోవడానికి ముగ్గురు కలిసి కోట్ చేసినట్టు సమాచారం. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మరి లైకా సంస్థ వీరికి రైట్స్ ఇస్తుందా లేదంటే వేచి చూస్తుందా చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!