HomeTelugu Big Storiesఅడవిలో రజిని అడ్వెంచర్స్‌ చూశారా!

అడవిలో రజిని అడ్వెంచర్స్‌ చూశారా!

4 8
డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సందడి చేయబోతున్నారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి రజనీ అటవీప్రాంతంలో తిరిగారు. ఈ కార్యక్రమం షూటింగ్‌ కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక వచ్చారు. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిత్రీకరణ జరిగింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను డిస్కవరీ ఛానల్‌ సోమవారం విడుదల చేసింది. ఇందులో రజనీ కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ.. సాహసాలు చేస్తూ కనిపించారు. ‘ఇది నిజమైన సాహసం..’ అంటూ తన ఫీలింగ్‌ చెప్పారు.

సూపర్‌స్టార్‌ ఉత్సాహం చూసి బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసించారు. తలైవాతో కలిసి పనిచేయడం గురించి ఆయన ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌ ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటారని, ఆయన ప్రతి ఛాలెంజ్‌ను గొప్పగా స్వీకరించారని అన్నారు. దీంతో ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పారు. మార్చి 23న రాత్రి 8 గంటలకు ఈ షో ప్రసారం కాబోతోంది. ‘మ్యాన్‌ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్ అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ… సాహసాలు చేస్తుంటారు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో కనిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu