HomeTelugu Trendingడ్రగ్స్‌ కేసులో ఆ నలుగురు హీరోయిన్‌లకు సమన్లు..

డ్రగ్స్‌ కేసులో ఆ నలుగురు హీరోయిన్‌లకు సమన్లు..

Rakul deepika shraddhasa
బాలీవుడ్‌లో సుశాంత్‌ మృతిలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్‌వుడ్‌కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్‌ను సైతం వెంటాడుతోంది. ముంబై‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సారా అలీఖాన్‌, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌ వంటి బీటౌన్‌ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్‌లోనూ ప్రముఖ నటీమణుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేరు బయట పడటంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతా చాట్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌ స్టార్స్‌ దీపికా, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సమన్లు జారీ చేసింది, మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu