కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రజలు గడప దాటడం లేదు. ఎప్పుడు బిజీగా గడిపే సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్స్ లేక సినిమా తారలంతా కుటుంబసభ్యులతో హాయి గా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ టైమ్ని మిస్ అవుతున్న అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నారు. తిరిగి షూటింగ్ లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
తాజాగా తన ‘ధృవ’ సినిమా సెట్స్ లో దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తూ.. ”ధృవ సినిమా సెట్స్ లోని త్రో బ్యాక్ పిక్స్ ఇవి. సెట్స్ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి” అంటూ చరణ్ పోస్ట్ చేశాడు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Throwback to #Dhruva shoot. Can’t wait to be back on sets. Till then, stay home and stay safe. pic.twitter.com/ZlaHcad8jn
— Ram Charan (@AlwaysRamCharan) May 16, 2020