టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ‘మహర్షి’ సాలిడ్ హిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు.. మహేష్ ను వంశీ ని మంచి స్నేహితులును చేసింది. ఈ నేపథ్యంలో మహేష్ తో మరో సినిమా చేస్తా అని వంశీ ప్రకటించారు. మహేష్ అనీల్ రావిపూడి తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసిన తర్వాత వంశీ తో సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ వంశీ సినిమాను పక్కన పెట్టాడు మహేష్. ఆయన ప్లేస్ లో గీతగోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వంశీ చెప్పిన స్టోరీ నచ్చకపోవడంతోనే మహేష్ ఆ సినిమాను పక్కన పెట్టాడని వినికిడి. ఇదిలా ఉంటే వంశీ.. మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. వీరిద్దరూ ఇంతకముందు ‘ఎవడు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర అనంతరం ‘ఆచార్య’ మూవీలో ఒక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.