మాస్ మహారాజా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈవెంట్లో ఆరుగురు టాలీవుడ్ దర్శకులు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్లో మాస్ ఫ్యాన్స్ను ఆకట్టుకునేలా రవితేజ యాక్టింగ్, డైలాగ్స్తో అదరగొట్టాడు. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. అలాగే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు నటుడు వేణు తొట్టెంపూడి. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు.