HomeTelugu Big Storiesఓ మై బేబీ పాట ట్రోల్స్‌పై రామజోగయ్య శాస్త్రి ఫైర్‌

ఓ మై బేబీ పాట ట్రోల్స్‌పై రామజోగయ్య శాస్త్రి ఫైర్‌

Oh My Baby Lyrical Song fro

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి నిన్న విడుదలైన ఓ మై బేబీ అనే పల్లవితో సాగే మెలోడీ విడుదల చేసారు.

ఈ పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ పై పలువురు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండగా వాటిపై రచయిత రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, వీటిపై ఎవరో ఒకరు స్పందించాల్సిందే అంటూ ట్వీట్ చేసిన రామజోగయ్య అనంతరం మరొక ట్వీట్ చేస్తూ ఫైర్ అయ్యారు.

ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరే వాడే అన్నారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని, మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా. అదే లేకపోతే ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం, తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి అంటూ రామజోగయ్యశాస్త్రి ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు.

ఈ వార్నింగ్ చూశాక నెటిజన్లు రామజోగయ్యశాస్త్రిని మళ్లీ తగులుకున్నారు! నిన్నటి పాటలో అసలేముందని తక్కువ అవడానికి… ఏమైనా ఉంటే కదా తక్కువ అవడానికి అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. తెలుగుదనం తక్కువైంది… త్రివిక్రమ్ సినిమాలో మెలొడీ సాంగ్స్ ను సిరివెన్నెల ఎంత బాగా రాసేవారో… అది మీ పాటలో లేదు అంటూ మరో నెటిజన్ నిర్మొహమాటంగా చెప్పేశాడు.

మీ (రామజోగయ్యశాస్త్రి) తప్పుకు అన్నయ్య (మహేశ్ బాబు) సారీ చెప్పాల్సి వస్తుంది అంటూ మరో నెటిజన్ వాపోయాడు. సాంగ్ లిరిక్స్ బాగాలేవు… ఇది ఒప్పుకోవడానికి మీకేంటి ప్రాబ్లం అని ఒకరు… పాట అంత బాగా రాస్తే ఇంకా 3 మిలియన్ వ్యూస్ కూడా రాకపోవడం ఏంటయ్యా అని మరొకరు వ్యాఖ్యానించారు.

;

Recent Articles English

Gallery

Recent Articles Telugu