HomeTelugu Trendingరష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ

రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ

Rashmi Bollywood entry
టాలీవుడ్‌లో రష్మిక హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో ఈ ఏడాది ఆరంభంలోనే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న నటి రష్మిక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న ‘మిషన్‌ మజ్ను’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘మిషన్‌ మజ్ను’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రష్మిక అభిమానులతో పంచుకుంది.

”మిషన్‌ మజ్ను’ సినిమాలో నేను కూడా ఓ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సినిమాతో కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది. భారత్‌ రా ఏజెన్సీ పాకిస్థాన్‌లో చేపట్టిన అత్యంత సాహసోపేతమైన మిషన్ కథతో ‘మిషన్‌ మజ్ను’ చిత్రం తెరకెక్కుతుంది’ అని రష్మిక పేర్కొంది. షాంతను భాగ్చీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu