రష్మిక మదన్నా చేసింది నాలుగైదు సినిమాలే అయినా తెలుగులో స్టార్ హోదా సంపాదించుకుంది . సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా రష్మికా క్రేజ్ ఉంది. తాజాగా ఆమె బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘కబీర్ సింగ్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన షాహిద్ కపూర్, ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఈ హీరో మరో తెలుగు సినిమా రీమేక్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాని దిల్ రాజు బాలీవుడ్ లో నిర్మించనున్నారు. ఈ సినిమాలో తెలుగులో శ్రద్దా శ్రీనాద్ చేసిన పాత్రకు రష్మికను తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే షాహిద్, మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఆమె ఒప్పుకుంటే ఆమెకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎంతో మంది ఎదురు చూసే బాలీవుడ్ ఆఫర్ ఆమెకు త్వరగా వచ్చిందనే చెప్పాలి.