HomeTelugu Trendingరవితేజ చిత్రానికి రెండు తేదీలు ప్రకటించిన నిర్మాతలు

రవితేజ చిత్రానికి రెండు తేదీలు ప్రకటించిన నిర్మాతలు

Rama Rao on duty

రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ మార్చి 25 లేదా ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ కూడా భాగస్వామిగా ఉన్నారు. విభిన్న కథాంశంతో యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితమే ప్రకటించినప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా మరో తేదీని కూడా ప్రకటించారు. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేయనున్నారు. రవితేజ సరసన దివ్యాన్ష, రజీషా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పాపులర్ నటుడు వేణు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా నాజర్, నరేష్, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu