HomeTelugu Trendingకూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు దేశాయ్‌..

కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు దేశాయ్‌..

5a 1

సినీ నటి రేణు దేశాయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు ‘జోగినిపల్లి సంతోష్ కుమార్’ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి త‌న‌ కూతురు, కూతురి స్నేహితురాలు య‌షిక‌తో కలిసి జూబ్లీహిల్స్ పార్కులో మొక్కలు నాటారు రేణు దేశాయ్. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్‌కి అల‌వాటు ప‌డ్డాం. ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలని విషయం తెలియడం లేదు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన చాలెంజ్ స్వీకరించాను.

ఈ రోజు నా కూతురు ఆద్య, ఆమె స్నేహితురాలు యషికతో క‌లిసి మొక్క‌లు నాటాను. చిన్న పిల్ల‌ల‌ను ఇందులో భాగం చేయ‌డం వ‌ల్ల వారికి మొక్క‌లు ఎలా నాటానే విష‌యం కూడా తెలుస్తుంది. ఇంత మంచి కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంతోష్‌గారికి అభినంద‌న‌లు’’ అని తెలిపారు. ప్రతి ఒక్క‌రు త‌మ‌కి తాము ఛాలెంజ్ విసురుకొని మొక్క‌లు నాటాల‌ని రేణూ విజ్ఞప్తి చేశారు. ఇక ఆద్యతో కలిసి రేణూ మొక్కలు నాటిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu