HomeTelugu Big Storiesప్రముఖ జర్నలిస్టుపై వర్మ సినిమా

ప్రముఖ జర్నలిస్టుపై వర్మ సినిమా

RGV announces a film on Arn
బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో మొదలైన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై రోజుకో వివాదం బయట పడుతూనే ఉంది. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్యేనని ముంబై పోలీసులు ప్రాథమికంగా తేల్చినప్పటికీ కొంతమంది దీనిని హత్యే అని ఆరోపిస్తున్నారు. బాలీవుడ్‌లోని కుట్రలు, కుతంత్రాలకు సుశాంత్ బలైపోయారని, నెపోటిజం కారణంగానే చనిపోయారని వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖులను ముంబై పోలీసులు ప్రశ్నించారు.

బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో మొదలైన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అండర్ వరల్డ్‌తో బాలీవుడ్‌కు సంబంధాలున్నాయని.. బాలీవుడ్‌లోని చీకటి రహస్యాలు బయటపడాల్సిన సమయం వచ్చిందన్నారు. దివ్య భారతి మృతి నుంచి జియా ఖాన్, శ్రీదేవి, ఇప్పుడు సుశాంత్ వరకు బాలీవుడ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, అర్నాబ్ వ్యాఖ్యలపై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్నాబ్‌‌పై ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

బాలీవుడ్‌పై అర్నాబ్ గోస్వామి వ్యాఖ్యలతో షాక్ అయ్యానంటున్నాడు రాంగోపాల్ వర్మ. బాలీవుడ్‌ను డర్టీ ఇండస్ట్రీ అని, క్రిమినల్ కనెక్షన్స్ ఉన్నాయని, రేపిస్టులు, గ్యాంగస్టర్స్, కామ పిశాచాలతో నిండిపోయిందని అర్నాబ్ అన్నట్టుగా వర్మ ఆరోపించారు. ‘‘దివ్య భారతి, జియా ఖాన్, శ్రీదేవి, సుశాంత్ మరణాలకు బాలీవుడ్ కారణంమని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నాడు వర్మ. గత 25 ఏళ్లలో జరిగిన ఈ నాలుగు మరణాలు వేర్వేరు సందర్భాల్లో జరిగినవి. అర్నాబ్ మనసు మాత్రం ఈ నాలుగు ఒకటేనని చెబుతోంది అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

అర్నాబ్ గోస్వామిపై తనదైన స్టైల్లో వర్మ సెటైర్ వేశాడు. ‘‘బాలీవుడ్ ఏమైనా శ్మశానంలో నిద్రపోతున్న దెయ్యమా? రక్తదాహంతో ఉన్పప్పుడల్లా ఇది డ్రాకులాగా మారిపోయి బయటికి వచ్చి చంపేస్తోందా?’’ అని వర్మ ప్రశ్నించారు. అర్నాబ్ గోస్వామి మొరుగుతుంటే ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, మహేష్ భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా ఇతర బాలీవుడ్ స్టార్లు ఎందుకు భయపడుతున్నారో, ఆఫీసుల్లో బల్లల కింద ఎందుకు దాక్కుంటున్నారో అర్థం కావడం లేదంటూ వర్మ మండిపడుతున్నారు. వీరంతా మౌనంగా ఉంటే కచ్చితంగా తప్పుచేసినట్టే అవుతుందన్నాడు. ఇండస్ట్రీలోని ప్రముఖులు బయటికి వచ్చి అర్నాబ్ గోస్వామి తప్పుడు ప్రకటనలపై మాట్లాడాలని, జింకలా భయపడకుండా అడవి శునకంలా విరుచుకుపడాలి అంటున్నాడు. అర్నాబ్ గోస్వామి నిజాన్ని దాచిపెట్టి తన డిబేట్‌లు నడుపుకోవడానికి వాడుకుంటారని వర్మ ఆరోపిస్తున్నాడు. తన డిబేట్‌లో కూడా ఏ ఒక్కరి అభిప్రాయాన్ని పట్టించుకోరని, అది ఆయన పద్ధతి అని వర్మ విమర్శించారు. ఓ వైపు అర్నాబ్ గోస్వామిపై విరుచుకుపడుతూ వరుస ట్వీట్లు చేస్తూనే ఆయనపై సినిమాను ప్రకటించేశాడు వర్మ.

కాంట్రవర్సీలతో ఆడుకునే వర్మ అలాంటి ఘటన దొరికితే చాలు సినిమా అంటాడు. తాజాగా అర్నాబ్ గోస్వామిపై సినిమా ప్రకటించేశాడు. ఈ సినిమాకు ‘అర్నాబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని టైటిల్ పెట్టాడు. ఇప్పటి వరకు సినిమా ప్రముఖులు, అండర్ వరల్డ్ డాన్స్, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులపై సినిమాలు తీసిన వర్మ.. తొలిసారి ఓ జర్నలిస్ట్‌స్టుకు వ్యతిరేకంగా సినిమా చేయబోతున్నాడు. అందులోనూ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న అర్నాబ్ గోస్వామిపై సినిమా తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవేళ అర్నాబ్ గోస్వామి తన సినిమాపై స్పందించినా, తనను కించపరచడానికి ప్రయత్నించినా దాన్ని తన సినిమా ప్రచారం కోసం వాడుకుంటానని వర్మ స్పష్టం చేస్తున్నాడు. అర్నాబ్ నోటిని చెత్తకుప్పతో పోల్చుతూ సినిమాల్లో హీరోలుగా ఉన్న వారంతా బయటికు వచ్చి అర్నాబ్ గోస్వామి లాంటి విలన్‌పై పోరాడాలంటున్నాడు వివాదాల వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu