HomeTelugu News'RRR‌'పై బుర్రా మాధవ్ కామెంట్స్‌

‘RRR‌’పై బుర్రా మాధవ్ కామెంట్స్‌

Burra sai madhav comments o

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, చిత్రంలో హీరో పాత్రల ప్రాధాన్యం గురించి వివరించారు.

సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సమానమైన ప్రాముఖ్యత ఉందని, అంతలా రాజమౌళి బ్యాలెన్స్ చేశారని చెప్పారు. తాను సైతం ఇద్దరికీ సమానంగా డైలాగులు రాశానని అన్నారు. పాత్రల నిడివి కూడా సమానంగానే ఉంటుందని, ఈ విషయంలో అభిమానులకు ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. అభిమానులు అంచనాలను ఈ సినిమా చాలా సులువుగా చేరుకుంటుందని, భారత సినిమా రంగాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని సాయి మాధవ్ వ్యాఖ్యానించారు. సాయి మాధవ్ ‘ఖైదీ నంబర్ 150’, ‘మహానటి’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘కంచె’ వంటి హిట్ చిత్రాలకు సంభాషణలను అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu