HomeTelugu Trendingమానవత్వాన్ని చాటుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ 

మానవత్వాన్ని చాటుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ 

1 3

యంగ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ మానవత్వాన్ని చాటుకున్నారు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని తన కారులో ఆస్పత్రికి తరలించాడు. వివరాల్లోకి వెళ్తే.. నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు సాయి ధరమ్ తేజ్. అయితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.42లో ఓ బైక్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన బైక్… కారును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి సుమారు 10 అడుగుల దూరం ఎగిరిపడ్డట్టుగా తెలుస్తోంది.

ఇక, అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్… వెంటనే కారు ఆపి.. దగ్గరికి వెళ్లి చూశాడు. ప్రమాదానికి గురైన వ్యక్తి తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అచ్చు రాజమణిని చూసి షాక్ తిన్నాడు. వెంటనే తన కారులో సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ప్రమాదంలో అచ్చు కాలుకు తీవ్ర గాయం కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu