HomeTelugu Trendingమరోసారి నానితో జతకట్టనున్న సాయి పల్లవి!

మరోసారి నానితో జతకట్టనున్న సాయి పల్లవి!

3 26
నేచురల్‌ స్టార్‌ నాని హీరో నటించిన ‘ఎం.సి.ఏ’ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో నాని తన ’27వ’ చిత్రం చేయనున్నాడు. దీనికి ‘శ్యాం సింగ రాయ్’ అనే టైటిల్ కూడా నిర్ణయించారు.

ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూవీయూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందనీ, పాత్ర ఆమెకు నచ్చిందనీ అంటున్నారు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉందనీ, అందుకే ఆమె ఒప్పుకోవచ్చు అని సమాచారం.

ఇదిలావుంచితే, ఈ చిత్రం పిరియాడిక్ కంటెంట్ తో సాగుతుందనీ, ఒకప్పటి కోల్‌కతా నగరాన్ని తలపించే నేపథ్యం అవసరమనీ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం వీలుపడదు కాబట్టి ఆ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాదులో భారీ సెట్స్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సెట్స్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ వుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu