HomeTelugu Trending'యశోద' సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు

‘యశోద’ సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు

samanthas yashoda movie se

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం రోజు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం’ అని చెప్పారు. మణిశర్మ స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి సీనియర్ సినీ పాత్రికేయులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ సంభాషణలు అందిస్తుండటం విశేషం.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu