HomeTelugu Trendingవరద బాధితులకు సంపూర్ణేష్‌ బాబు సాయం.. నెటిజన్ల ప్రశంసలు

వరద బాధితులకు సంపూర్ణేష్‌ బాబు సాయం.. నెటిజన్ల ప్రశంసలు

6 11బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. కర్ణాటక వరద బాధితులకు చేయూతగా నిలిచారు. కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షలు విరాళం అందిస్తున్నట్లు సంపూ వెల్లడించారు. వరదల కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి తన మనసు చలించిందని పేర్కొంటూ ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేశాయి. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా ‘హృదయ కాలేయం’ నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫొటోలు చూసి చాలా బాధపడ్డా. నా వంతుగా రూ.2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నాను’ అని సంపూర్ణేష్‌ బాబు పోస్ట్‌ చేశారు. చిన్న నటుడు అయినప్పటికీ తోచిన సహాయం చేయడం పట్ల నెటిజన్లు ఆయన్ను ప్రశంసించారు.

మరోపక్క సోమవారం ‘కొబ్బరిమట్ట’ నిర్మాత సాయి రాజేష్‌ పుట్టినరోజు సందర్భంగా సంపూ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. గుడికి వెళ్లి పూజ చేయించారు. ట్విటర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. సంపూర్ణేష్‌ బాబు తాజాగా నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఆగస్టు 10వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమ బడ్జెట్‌కు తగ్గట్టు సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోందని నిర్మాత తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu