HomeTelugu Big Storiesయానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదు: డైరెక్టర్

యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదు: డైరెక్టర్

Animal director commentsAnimal Movie: యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదని స్వయంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశాడు. ఈ మూవీకి A సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని అనడం గమనార్హం. డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న యానిమల్ మూవీపై దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయిన సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత హిందీలో కబీర్ సింగ్ పేరుతో తీశాడు. ఇప్పుడు యానిమల్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. యానిమల్ మూవీ ట్రైలర్‌లోనే విపరీతమైన హింసాత్మక దృశ్యాలు ఉండటంతో సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.

యానిమల్‌ మూవీకి A సర్టిఫికెట్ ఇవ్వడంతో దర్శకుడు సంతోషం వ్యక్తం చేశాడు. 18 ఏళ్ల లోపు వారికి ఇది సూటయ్యే సినిమా కాదు. నా కొడుకు అర్జున్, నా సోదరుడి పిల్లలు లేదంటే కజిన్స్ పిల్లలను కూడా థియేటర్లలో సినిమాకు తీసుకెళ్లను. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను అన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu