HomeTelugu Trending'సరిలేరు నీకెవ్వరు' ఆంథమ్‌ వచ్చేసింది

‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌ వచ్చేసింది

7 20
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ఆంథమ్‌ వచ్చేసింది. ఈ పాట తనకు చాలా నచ్చిందని స్టార్‌ హీరో మహేష్‌బాబు ట్వీట్‌ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ చక్కటి సంగీతం అందించారని, ఈ పాట వ్యక్తిగతంగా తన హృదయానికి చేరువైందని అన్నారు. సైనికుల విలువ, వారి త్యాగాల్ని గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట నిజంగా మనసులు కదిలించే విధంగా ఉంది.
‘మారణాయుధాలు ఎన్ని ఎదురైనా.. ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.. ఒకడే ఒకడు వాడే సైనికుడు..’ అని సాగిన ఈ గీతం ఆకట్టుకుంటోంది. ఈ పాట కోసం దేవిశ్రీ యూరప్‌ వెళ్లి అక్కడి కళాకారులతో కలిసి సంగీతాన్ని కంపోజ్‌ చేశారు. శంకర్‌ మహదేవన్‌ పాటను ఆలపించారు.

‘మహర్షి’ తర్వాత మహేష్‌ నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, సత్యదేవ్‌, నరేష్‌, సంగీత, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా ప్రత్యేక గీతంలో అలరించనున్నారు. అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 11న విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!