HomeTelugu Big Storiesమహేష్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

మహేష్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

Sarkaru vaari paata first n
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన అభిమానులకి శుభవార్త వినిపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్‌ అందిస్తున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. పరశురామ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహేశ్‌ ఇప్పటి వరకూ కనిపించని న్యూ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌ పోస్టర్‌ ఆకాశాన్నంటే అంచనాల్ని పెంచింది. దాంతో మహేష్‌ ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట ఫస్ట్‌ నోటీస్‌.. జులై 31న’ అంటూ చిత్ర బృందం మరో ఫొటోని పంచుకుంది. ఇందులో మహేష్‌ బ్యాగ్‌ పట్టుకుని కనిపించారు. మరి ఆ ఫస్ట్‌ నోటీస్‌ ఫస్ట్‌ లుక్కేనా? మరేదైనా ఆసక్తికర అప్‌డేటా అంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల పునః ప్రారంభమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu