HomeTelugu Trendingశర్వానంద్‌ మహాసముద్రం.!

శర్వానంద్‌ మహాసముద్రం.!

3 22
యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ రూపొందుతోంది. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ తన తదుపరి సినిమాగా ‘మహాసముద్రం’ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ తరువాత ‘మహాసముద్రం’ కథను సిద్ధం చేసుకున్నాడు. నాగచైతన్య – సమంత జంటగా ఆయన ఈ సినిమాను చేయాలనుకున్నాడు. చైతూ – సమంత ఇద్దరికీ కథ వినిపించడం జరిగిపోయింది. అయితే చైతూకి గల కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యేలా వుందట. అందువలన శర్వానంద్ ను అజయ్ భూపతి సంప్రదించడం.. అయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇక హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu