స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి సందర్బంగా విడుదలైన సూపర్ హిటైన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలుగొట్టింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించగా.. మిగితా ప్రధాన పాత్రల్లో టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, జయ రామ్, మురళీ శర్మ తదితరులు నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిచ్చారు. సినిమా విడుదల కాక మునుపే ఈ సినిమా పాటలు తెలుగు ప్రజల్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కామెడీ సీన్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్తో ఆకట్టుకుంది. బన్నీ తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అది అలా ఉంటే ఈ ‘అల వైకుంఠపురంలో’ ఫీవర్ హిందీ సినిమా ఇండస్ట్రీ సోకింది. ఈ సినిమాలో ఓ రేంజ్లో ఆకట్టుకున్న మాస్ సాంగ్ రాములో.. రాములా. ఈ సాంగ్ యూట్యూబ్లో సంచనాలు సృష్టించింది. ఆ సాంగ్లో బన్నీ వేసిన దోశ స్టెప్ ఎంత పాపులర్ తెలిసిందే.
ఆ సినిమాలో అలాంటి మరో హిట్ సాంగ్ బుట్ట బొమ్మ. ఈ సాంగ్ అటు టిక్ టాక్లో ఇటూ ఇన్స్టాగ్రామ్లో తెగ సందడి చేసింది. ఈ పాటకు స్టెప్ వేసి అలరించింది బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి. ప్రస్తుతం ఆమె వేసిన బుట్ట బొమ్మ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
@TheShilpaShetty tiktok Buttabomma song#AlaVaikunthapurramuloo @alluarjun @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine @GeethaArts @SKNonline pic.twitter.com/l8MGeBomqz
— Y. J. Rambabu (@yjrambabu) February 8, 2020