HomeTelugu Trendingమహేశ్‌బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం

మహేశ్‌బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం

Shilpa shirodkar tests covi
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది.వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్‌ హాసన్‌, అర్జున్‌, బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌, టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీకి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

ఇక సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోని, అన్ని నియమాలను పాటించండి’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేసింది శిల్ప. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu