యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్తో తన నెక్స్ట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘అరవింద సమేత’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
కథాపరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. అందువలన తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను మంచి క్రేజ్ కలిగివున్న హీరోయిన్ను తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జాన్వీకపూర్ .. పూజ హెగ్డే పేర్లు వినిపించాయి. తాజాగా శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. ఒక హీరోయిన్గా ఆమెను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ – శృతి హాసన్ కాంబినేషన్లో ‘రామయ్యా వస్తావయ్యా’ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.