HomeTelugu Big Storiesచిరు సరసన బాలీవుడ్ తారలు!

చిరు సరసన బాలీవుడ్ తారలు!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే మరో ప్రతిష్టాత్మక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా స్థాయి పెరగడం ఆ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడలో బాలీవుడ్ కు చెందిన క్రేజీ స్టార్స్ నటించబోతున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ రోల్ లో చిరంజీవి కనిపించనున్నారు. దీనికోసం ఆయన గడ్డం మీసాలను పెంచి కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. మొదట ఈ సినిమాలో కథానాయికలుగా విధ్యాబాలన్, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా వంటి తారలను సంప్రదించారు. తాజాగా చిరు సరసన సోనాక్షిసిన్హా, ఐశ్వర్యారాయ్ ల ఎంపిక పూర్తయిందని సమాచారం. త్వరలోనే దీని గురించి నిర్మాత రామ్ చరణ్ ఓ ప్రకటన కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనాక్షి కాగా, ఐశ్వర్యారాయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కీలకపాత్రలో కనిపించనుంది. దీనికోసం ఆమెకు భారీగానే ముట్టజెప్పబోతున్నారు. ఆమె పాత్ర కూడా అధ్బుతంగా ఉంటుందని సమాచారం. ఆగస్ట్ నెలలో ఈ సినిమాను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu