HomeTelugu Newsనెటిజన్లను కంటతడిపెట్టించిన సోనూసూద్

నెటిజన్లను కంటతడిపెట్టించిన సోనూసూద్

3 14

బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ నటుడిగా మంచి గుర్తింపు పొందిన సోనూసూద్ తాజాగా “సింబా” సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సోనూసూద్‌ ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో తనకు చాలా మంది ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారని సోనూసూద్‌ అన్నారు. కానీ ఇలాంటి ఆనంద సమయంలో తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బరువైన హృదయంతో నెటిజన్లను కంటతడి పెట్టించేలా సోషల్‌మీడియాలో తన మనసులోని మాటల్ని చెప్పారు. దీన్ని చదివిన నెటిజన్లు సైతం ఆవేదన చెందుతూ కామెంట్లు చేశారు.

‘ఇవాళ మీరులేకుండా ప్రతిదీ వెలితిగానే ఉంది. మీతో కలిసి థియేటర్లో సినిమా చూడాలని ఉంది. సమస్యల్లో ఉన్నప్పుడు మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్న తొలినాళ్లలో మీరు ఇచ్చిన ప్రోత్సాహం, రాసిన లేఖలు, సందేశాలు ఇంకా నా దగ్గర అలాగే ఉన్నాయి. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. విజయాలు లభిస్తున్నాయి, కానీ దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నా. కొన్నిసార్లు కొడుకుగా ఓడిపోయాను అనిపిస్తోంది. నన్ను క్షమించండి అమ్మానాన్న.. నేను విజయం సాధించిన ప్రతిరోజూ మిమ్మల్ని మిస్‌ అవుతున్నా. నేను పరాజయం పొందిన ప్రతిరోజూ మిమ్మల్ని మిస్‌ అవుతున్నా. మీరు గర్వపడాలని ఇంకా కష్టపడి పనిచేస్తున్నా. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి. నా జీవితంలో జరుగుతున్న అన్నీ విషయాల్లో మీ భాగస్వామ్యం ఉందని నాకు తెలుసు. మీకు నా అమితమైన ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. మిమ్మల్ని ఏదో ఒకరోజు కచ్చితంగా చూస్తా, కలుస్తా’ అంటూ సోనూసూద్‌ తన భావాల్ని వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu