టాలీవుడ్లో ‘పెళ్లి సందD’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీ. ఈ కన్నడ బ్యూటీ ముందుగా కన్నడ సినిమాలతోనే తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
ఆ తరువాత రవితేజ ‘ధమాకా’ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాలోనూ అవకాశాన్ని సంపాదించుకుంది. ఇక త్రివిక్రమ్ – మహేశ్ బాబు సినిమాలో ఒక హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా శ్రీలీలను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో ఆమె మహేశ్ బాబు మరదలి పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 2వ వారంలో సెట్స్ పైకి వెళుతోంది. త్రివిక్రమ్ – మహేశ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది.