సౌత్ లో మమ్ముట్టి గ్రేట్ యాక్టర్. అందులో సందేహం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మమ్ముట్టి నటించాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం తెలుగులో వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న యాత్ర సినిమాలో వైఎస్ఆర్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 8 న విడుదల కాబోతుంది.
అటు మలయాళంలో కూడా మమ్ముట్టి మధుర రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్ కూడా నటిస్తోంది. మమ్ముట్టి, సన్నీలియోన్ షూటింగ్కు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. మమ్ముట్టి ట్రెడిషన్ గా ఉంటే, సన్నీలియోన్ గోల్డ్ కలర్ డ్రెస్ లో అల్ట్రా మోడ్రన్ గా ఉంది. మమ్ముట్టి సినిమాలో చేస్తూనే.. మరోవైపు సోలో హీరోయిన్ గా మలయాళంలోకి రంగీలాగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది సన్నీలియోన్.