సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సభ్యులు తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు. బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మహేష్ బాబు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ బాబు దంపతులతో పాటు నటి విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, ఎన్వీ ప్రసాద్తో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ సభ్యులు తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం ఆలయ అధికారులు.. మహేష్ బాబు దంపతులతో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ సభ్యులకు స్వామి తీర్ధ ప్రసాదలు అందజేశారు.