HomeTelugu Trendingముంబై కి గుడ్ బై చెప్పిన సుశాంత్‌ 'దిల్ బేచారా' హీరోయిన్..

ముంబై కి గుడ్ బై చెప్పిన సుశాంత్‌ ‘దిల్ బేచారా’ హీరోయిన్..

3 1

ముంబై కి గుడ్ బై చెప్పిన సుశాంత్‌ ‘దిల్ బేచారా’ హీరోయిన్..బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’ లో నటించిన హీరోయిన్ సంజనా సాంఘి తీవ్ర భావోద్వేగంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో… “బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. ఇక్కడి వీధులన్నీ వింతగా, కొత్తగా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో నిండుకున్న బాధ కారణంతో నా చూపు కూడా మారిందేమో… వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కాకుంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు కూడా” అంటూ పోస్ట్ చేసింది. ఆమె మొదటిసారి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘దిల్ బేచారా’ ఓటిటి లో విడుదలవడం, సుశాంత్ మరణం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu