HomeTelugu Newsఅనంతపురంలో తహశీల్దారుకు కరోనా

అనంతపురంలో తహశీల్దారుకు కరోనా

9a
అనంతపురం జిల్లాలో ఓ తహశీల్దారుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కలెక్టర్ వెల్లడించారు. హిందూపురంలో నివసిస్తున్న తహశీల్దారు కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. తహశీల్దారు అటెండర్, డ్రైవర్, కార్యాలయ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మడకశిర ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షకు తహశీల్దారు హాజరుకావడంతో ఎమ్మెల్యే సైతం క్వారంటైన్‌కు తరలించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,500 మంది కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా 473 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 10,032 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu