
Thandel pre-release business:
ఈ సంక్రాంతి బ్లాక్బస్టర్ల తర్వాత అందరి దృష్టి ఫిబ్రవరి 7, 2025న విడుదల కానున్న నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ పై ఉంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ ధరకు ముగిసింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లకు ముగిసింది. ఇది నాగచైతన్య కెరీర్లో ఇప్పటి వరకు జరిగిన అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్గా నిలిచింది. ఈ సినిమా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడం, తెలుగు రాష్ట్రాల్లో చిత్రంపై ఉన్న విపరీతమైన క్రేజ్ను చూపిస్తుంది. ముఖ్యంగా సాయి పల్లవి ఈ సినిమాలో నటించడంతో చిత్రానికి మరింత హైప్ ఏర్పడింది.
ఈ సినిమా పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. సాయి పల్లవి డ్యాన్స్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. నాగచైతన్య కూడా తన పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ALSO READ: Shah Rukh Khan కొత్త లెక్సస్ కార్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!