మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీతో బిజీగా ఉన్నాడు. స్టూవర్ట్ పురం గజదొంగ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని.. భారీ ఖర్చుతో నిర్మాణమిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ విలేజ్ నే నిర్మించారు.
స్టూవర్ట్ పురం విలేజ్ ను నిర్మించి అక్కడ షూటింగ్ చేసారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. సినిమా ఫైనల్ షెడ్యూలు ను విశాఖలో ప్లాన్ చేసారు. ఈ మేరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ ఎత్తున షూటింగ్ ఏర్పాట్లు చేసారు. విశాఖ సముద్రం నేఫథ్యంలో భారీ నైట్ షూటింగ్ ఏర్పాట్లు చేసారు.
ఇప్పటి వరకు గొప్పవ్యక్తుల బయోపిక్ లు చూసాం. ఓ గజదొంగ బయోపిక్ రావడం ఇదే తొలిసారి కావచ్చు. దర్శకుడు వంశీకృష్ణ తో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ కెరియర్లో ఇదే హైబజ్డెట్ మూవీ. ఈ సినిమాలో నూపర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏస్ ఫోటోగ్రాఫర్ మాధి వర్క్ చేస్తున్న సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు