HomeTelugu TrendingTillu Square: కలెక్షన్లపై నిర్మాత ధీమా‌‌.. ఆరోజే 'టిల్లు-3' ప్రకటన

Tillu Square: కలెక్షన్లపై నిర్మాత ధీమా‌‌.. ఆరోజే ‘టిల్లు-3’ ప్రకటన

 

Tillu Square

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈక్రమంలో తాజాగా మూవీ యూనిట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు.

ఈసందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘టిల్లు స్క్వేర్‌’కు కొనసాగింపుగా మరో సినిమా రానుందని తెలిపారు. ”తొలిరోజు రూ.25 కోట్ల గ్రాస్‌ ఉండొచ్చనుకుంటున్నా. ప్రేక్షకుల స్పందనను దృష్టిలోపెట్టుకొని థియేటర్లు, షోలు పెంచడానికి ప్రయత్నిస్తున్నా. ఓవర్‌సీస్‌లో ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. ఐపీఎల్‌ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైంది. దాని కారణంగా సినిమా కలెక్షన్స్‌ ఎఫెక్ట్‌ కావడం లేదు. మా సినిమా దాదాపు రూ.100 కోట్లు గ్రాస్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్లైమాక్స్‌కు ‘టిల్లు 3′ అనౌన్స్‌మెంట్‌ అటాచ్‌ చేసి సోమవారం నుంచి ప్రదర్శిస్తాం” అని నాగవంశీ అన్నారు.

ఇక హీరోయిన్‌ అనుపమ మాట్లాడుతూ.. ”టిల్లు స్క్వేర్‌’ కోసం ఈ టీమ్‌తో దాదాపు రెండేళ్లు కలిసి జర్నీ చేశా. ఈ ప్రయాణం ఎంతో సరదాగా సాగింది. లిల్లీగా నా నటన అద్భుతంగా ఉందని.. నేహాశెట్టి (డీజే టిల్లు హీరోయిన్‌) కాల్‌ చేసి మెచ్చుకుంది. ఆమె ప్రశంసలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి” అని తెలిపారు.

యూత్‌ఫుల్‌, రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంది. మల్లిక్‌రామ్‌ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. మురళీశర్మ, మురళీధర్‌ గౌడ్, నేహా శెట్టి, ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu