HomeTelugu Trendingప్రముఖ నిర్మాత , పీఆర్వో బీఏ రాజు కన్నుమూత

ప్రముఖ నిర్మాత , పీఆర్వో బీఏ రాజు కన్నుమూత

Tollywood PRO BA raju passe
ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు (62) కన్నుమూశారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు శివకుమార్‌ తెలిపారు. 1500కు పైగా సినిమాలకు పీఆర్వోగా చేయడంతోపాటు తన భార్య బి.జయ దర్శకత్వం వహించిన ‘ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం’ వంటి విజయవంతమైన చిత్రాలకు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాన్నాళ్లపాటు ‘సూపర్‌హిట్‌’ అనే సినీ పత్రికను నడిపారు. బీఏ రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జయ 2018లో కన్నుమూశారు. రాజు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu