HomeTelugu Trendingఆ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం సీక్వెల్ రాబోతుందా..?

ఆ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం సీక్వెల్ రాబోతుందా..?

5 6
టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డులను సైతం కొల్లగొట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. యూఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి బన్నీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారా? అంటే టాలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి.

‘అల.. వైకుంఠపురములో’ చిత్రీకరణలో ఉండగానే త్రివిక్రమ్‌తో కలిసి మరో సినిమా చేయాలని అల్లు అర్జున్‌ అనుకున్నారట. ఇప్పుడు, ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికే కొనసాగింపుగా మరో సినిమా తీస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై టాలీవుడ్‌లో గాపిప్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. బన్నీ అభిమానులకు పండుగనే చెప్పాలి. మరి సీక్వెల్‌ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌ .. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu