మెగా పవర్ స్టార్ రామ్చరణ్, యంగ్ హీరో అఖిల్ విహారయాత్రని ఎంజాయ్ చేస్తున్నారు. మంచులో సాహసాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా వీరు అక్కడ దిగిన ఫొటోను చరణ్ సతీమణి ఉపాసన ట్విటర్లో షేర్ చేశారు. ‘అబ్బాయిలు ఎప్పటికే అబ్బాయిలే. అక్కడ కూడా యాక్షన్ సన్నివేశాల్ని సాధన చేస్తున్నారని అనుకుంటున్నా’ అని ఆమె పోస్ట్ చేశారు. ఈ ట్రిప్కు ఉపాసన వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు.
రామ్చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వాణీ హీరోయిన్ పాత్రలో కనిపించారు. కాగా చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటించగా, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.