‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఇప్పటికే వేసిన ప్రత్యేక షోలను ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుటుంబం థియేటర్ వద్ద ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్ధరాత్రి స్క్రీనింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, పిల్లలతో వచ్చారు. చిరంజీవి కూడా RRR ప్రత్యేక స్క్రీనింగ్ కు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఫోటోలు బయటకు వచ్చాయి. RRR సినిమాను చూసి థియేటర్ నుండి బయటికి రాగానే ఫొటోగ్రాఫర్లు రామ్ చరణ్ ఫోటోలను క్లిక్ చేసారు. ఇక అభిమానుల సందడి మామూలుగా లేదు. దీంతో చెర్రీ అభిమానులందరినీ పలకరించి, ఫోటోలకు ఫోజులిచ్చారు.
RRR బృందం, తారాగణం, సిబ్బంది చూడటానికి అర్ధరాత్రి ప్రత్యేక స్క్రీనింగ్ను నిర్వహించిన విషయం తెలిసిందే. స్క్రీనింగ్కు హాజరైన రామ్ చరణ్ RRR కస్టమైజ్డ్ టోపీతో క్యాజువల్ లుక్లో కనిపించాడు. చెర్రీ భార్య ఉపాసన థియేటర్లో సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేసిందట. ఉపాసన తెరపై తన భర్త నటనను చూసి కేకలు, ఈలలు వేస్తూ సాధారణ ప్రేక్షకురాలిలా ఎంజాయ్ చేసిందట.
నాటు నాటు సాంగ్కు కేకలు పెడుతున్న ఫ్యాన్స్పైనా పేపర్లు చల్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే నెట్టింట ఆర్ఆర్ఆర్కు సౌత్ నుంచి నార్త్ దాకా అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు.